డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయకాంత్ చాలా రోజుల తర్వాత సీన్లోకి వచ్చారు. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో.. అమ్మ తప్పు చేయలేదని నిరూపిస్తే, తాను ఒక పక్క మీసం తీసేస్తానని విజయకాంత్ సవాల్ చేశారు.
విజయకాంత్ బుధవారం చెన్నైలో, గురువారం రిషి వందియం నియోజకవర్గంలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను బతకడం కోసం రాజకీయాల్లోకి రాలేదని, కష్టపడి పని చేసి, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చానన్నారు.
తమిళనాడులో పాలకులు ప్రతిపక్షాల గళం నొక్కేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని, ప్రతిపక్షాలను నీచంగా చూశారని, ఇప్పుడు వారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో చూడాలని, జయలలిత జైలులో ఉండటాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ధర్మం గెలుస్తుందన్నారు. ప్రజలకు మంచి చేయకుండా, దోచుకోవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చే వారికి శిక్ష తప్పదన్నారు.
No comments:
Post a Comment