Thursday 9 October 2014

ఆళ్ళగడ్డ... వైసీపీ అభ్యర్థి అఖిలప్రియ

ఆళ్లగడ్డ శాసన సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా దివంగత మహిళా నేత భూమా శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ పేరును ఖరారు చేశారు. గత ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో కారు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణించినా ఆళ్లగడ్డ ఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించి దేశంలోని ఓ అరుదైన రికార్డును మరణించాక కూడా సాధించారు. ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ స్థానం నుంచి  అఖిలప్రియారెడ్డిని ఆళ్ళగడ్డ ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకంలో జగన్ పార్టీ నాయకులు వున్నారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టదని వైసీపీ నాయకులు ఆశిస్తున్నారు.

No comments:

Post a Comment