Friday 17 October 2014

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణరెడ్డి అజ్ఞాతంలోకి

గుంటూరు: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఎమ్మెల్యే సెల్ ఫోన్ గత రెండు రోజులుగా పనిచేయడం లేదు. వ్యక్తిగత సిబ్బందికి తెలియకుండానే ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారు. చెన్నాయపాలెం సరస్వతీ సిమెంట్ ఫ్యాక్టరీ భూమల వివాదంలో పిన్నెల్లి ఏ-2 నిందితుడు. ఏ-1 నిందితుడిగా ఎమ్మెల్యే సోదరుడు వెంకటరామిరెడ్డి ఉన్నారు. అయితే వీరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం చేసుకున్నారు. దీంతో రామకృష్ణరెడ్డి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బెయిల్ లభించక పోవడంతో ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment