Thursday 16 October 2014

గుంటూరులో మైనర్ ప్రేమికుల ఆత్మహత్యాయత్నం!

lovers suicideగుంటూరు, బాపట్లలో నలుగురు మైనర్ ప్రేమికులు సామూహిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ ప్రేమ పెళ్లిళ్లకు కుటుంబ సభ్యులు అంగీకరించన్న భావనతో వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీంతో నలుగురు ఒకేసారి పురుగుల మందు సేవించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
బుధవారం చోటు చేసుకున్న సంఘటన వివరాలను పరిశీలిస్తే.. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ప్రత్యూష, దుర్గ అనే ఇద్దరు మైనర్ బాలికలు ఉన్నత కుటుంబాలకు చెందిన యువతులు. వీరు ఇంటర్ చదువుతున్నారు. అలాగే, గోపిరెడ్డి ఇంటర్ చదువుతుండగా, శివసత్యనారాయణ ఖాళీగా ఉంటాడు. బాపట్లకు చెందిన ఈ నలుగురూ ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న ఆలోచనతో నలుగురూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. 
 
దీంతో నలుగురూ కలిసి పురుగుల మందు తాగారు. వీరిని స్థానికులు గమనించి 108కు ఫోన్ చేశారు. నలుగుర్నీ బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రత్యూష, దుర్గ పరిస్థితి విషమంగా ఉంది.

No comments:

Post a Comment