Wednesday 15 October 2014

జగన్‌ విరాళం రూ.50 లక్షలు.. ఎన్టీఆర్ ట్రస్టీగా నారా లోకేష్.

హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం వైసీపీ అధ్యక్షుడు జగన్ తన వంతు సాయంగా 50 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. అలాగే వికాస తరంగిణి సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేసింది. కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం రూ.3,11,116ను విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపింది.
 
ఇకపోతే.. తుఫాన్‌ బాధితుల సహాయం కోసం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ రంగంలోకి దిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని తుఫాను బాధితుల కోసం రోజూ 10 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్‌ ట్రస్ట్ ట్రస్టీ నారా లోకేష్‌ పర్యవేక్షణలో మరో 5 రోజుల పాటు ఈ శిబిరాలు నిర్వహిస్తారు. 
 
తుఫాను బాధితులకు వైద్యసేవలు అందించేందుకు యశోద ఆస్పత్రుల వైద్య బృందం బుధవారం విశాఖపట్నం బయలుదేరింది. ఐదుగురు వైద్యులతో బాటు ఆరుగురు మెడికల్‌ టెక్నీషియన్ల తమ బృందం ఈసీజీ, అల్ట్రా సౌండ్‌, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌లు, ఇతర అత్యవసర మందులు తీసుకొని విశాఖకు వెళ్ళారు. 

No comments:

Post a Comment