హుదూద్ తుఫాను బాధితులకు రేణు దేశాయ్ రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించగా, టాలీవుడ్ టాప్ హీరోయిన్లు అయిన సమంత రూ.10 లక్షలు, కాజల్ అగర్వాల్ రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే, తమన్నా, తమన్నా, నయనతార, కమిలిని ముఖర్జీ, ప్రియమణి, తాప్పీ, దీక్షాసేథ్ వంటి హీరోయిన్లు ఇప్పటి వరకు ఏమాత్రం స్పందించడం లేదు.
హుదూద్ తుఫాను బాధితులకు అండగా నిలిచేందుకు తెలుగు సినిమా హీరోలు ఇప్పటికే విరాళాలు ప్రకటిస్తుండగా హీరోయిన్లు సైతం తమవంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తనకు ఆదర్శమని చెప్పుకునే రేణూ దేశాయ్ రూ.20 లక్షలు, కాజల్ అగర్వాల్ రూ.5 లక్షలు, సమంత రూ.10 లక్షలు చొప్పున విరాళాలు ప్రకటించారు. అయితే, తమన్నా మాత్రం ఇప్పటి వరకు తన విరాళాన్ని ప్రకటించలేదు. మరోవైపు.. తెలుగు ఇండస్ట్రీలో మరికొందరు హీరోయిన్లు విరాళాలు ప్రకటించే అవకాశం లేకపోలేదు. టాలీవుడ్ నెం.1 హీరోయిన్లుగా వెలిగిపోతున్న తారామణులు అది కేవలం హీరోలకే వర్తిస్తుందనుకుని మిన్నకున్నారో ఏమోగానీ రేణూ దేశాయ్ మాత్రం తన ఉదారతను చాటుకుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్లాది రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్న హీరోయిన్లు ఏదో సమంత లాంటివారు స్పందించారు తప్పితే మిగిలిన హీరోయిన్లు స్పందన లేదు. మొత్తమ్మీద రేణూ దేశాయ్ విరాళం నేపథ్యంలోనైనా తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లు స్పందిస్తారేమో చూడాలి.
No comments:
Post a Comment