Tuesday 7 October 2014

27మంది యువతులతో రాసలీలలు, వీడియోతో తీసి..

చెన్నై: డబ్బు ఆశను చూపి లొంగదీసుకోవడం, ఏకాంతంగా ఉన్నప్పటి దృశ్యాలను వీడియో తీసి బెదిరింపులకు గురిచేయడమే పనిగా పెట్టుకున్న ఓ ఫైనాన్షియర్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పాపం పండి ఇప్పుడు ఎట్టకేలకు కటకటాలు లెక్కపెడుతున్నాడు. సదరు ఫైనాన్షియర్ ఏకంగా 27 మందిని లొంగదీసుకున్నాడు. తమిళనాడు ధర్మపురి జిల్లా పాలక్కాడుకు చెందిన శివరాజ్‌ ఫైనాన్షియర్‌. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. పేద యువతులను టార్గెట్‌ చేసుకుని డబ్బు ఆశ చూపి లొంగదీసుకునేవాడు. అలా వారితో ఏకాంతంగా గడిపిన క్షణాలను రహస్యంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, బెదిరింపులతో కామవాంఛ తీర్చుకునేవాడు. ఓ బాధితురాలు ధైర్యం చేసి జిల్లా ఎస్పీని ఆశ్రయించడంతో ఫైనాన్షియర్‌ గుట్టు రట్టయింది. సోమవారం కామాంధుడ్ని అరెస్టు చేశారు. అతని సెల్‌ఫోన్‌లో 27 మందితో లైంగిక కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు కూడా బయల్పడ్డాయి. పోలీసులు పలు ఆధారాలతో శివరాజ్‌ని అరెస్టు చేశారు. అతని సెల్‌ఫోన్‌లో దాదాపు 27 మందితో లైంగిక కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు బయటపడ్డాయి.

No comments:

Post a Comment