కేంద్ర మాజీ, తిరువనంతపురం కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు శశి థరూర్ భార్య సునంద పుష్కర్ కొద్ది నెలల క్రితం అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. ఆమె విష ప్రయోగం జరపడం వల్లే మృతి చెందారని పోస్టుమార్టం రిపోర్టు బయటపెట్టింది. సునందా పుష్కర్ భౌతికకాయానికి నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో ఈ విషయం వెల్లడయిందని స్పెషల్ మెడికల్ టీమ్ ప్రకటించింది. న్యూఢిల్లీలోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యులతో ఏర్పాటైన ఈ టీమ్ తమ నివేదికను పోలీసులకు సమర్పించినట్టు సమాచారం. శశి థరూర్తో పాక్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ప్రేమ వ్యవహారం నడుపుతోందని భావించిన సునందా పుష్కర్, ఆమెతో ట్విట్టర్లో సంవాదం చేసిన తర్వాత ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.
No comments:
Post a Comment