Tuesday 7 October 2014

హారీశ్‌ ఎదుటే టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం

గజ్వేల్‌అర్బన్‌: మంత్రి హారీశ్‌రావు ఎదుటే టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మెదక్‌ జిల్లా గజ్వేల్‌లో మంగళవారం జరిగింది. గజ్వేల్‌లో మెదక్‌ జిల్లా కార్యకర్తల సమావేశంలో మంత్రి హారీశ్‌రావు మాట్లాడుతుండగా జగదేవ్‌పూర్‌ మండలం ఇటీక్యాల గ్రామ ఎంపీటీసీ భాస్కర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. కాగా ఈ సమయంలో పక్కన ఉన్న కార్యకర్తలు గమనించి పెట్రోల్‌ సీసాను తీసివేసి బయటకు పంపించారు. తనకు సంబంధం లేని విషయంలో బాధ్యుణ్ని చేయాలని గ్రామస్తులు, పోలీసులు చూస్తున్నారని ఆవేదనతో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహాత్యకు యత్నించినట్లు భాస్కర్‌ తెలిపారు. 

No comments:

Post a Comment