Friday 17 October 2014

రైలు కింద పడి తల్లికూతుళ్ల మృతి

వరంగల్ : రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. చిన్నారులతో సహా ఆత్మహత్యలు చేసుకోవడం కలిచివేస్తోంది. నిన్న ఘట్ కేసర్ శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో తల్లి ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిచిపోకముందే తాజాగా వరంగల్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ శివారులోని తల్లి, ఇద్దరు కూతుళ్లతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వారి వివరాలు తెలియరాలేదు. 

No comments:

Post a Comment