Thursday 9 October 2014

హైదరాబాద్‌లో టెక్కీ అదృశ్యం... భర్త ఫిర్యాదుతో వెలుగులోకి..

Hyderabad
హైదరాబాద్ నగరం, కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యమయ్యారు. గురువారం ఉదయం ఆమె క్యాబ్ లో డ్యూటీకి బయల్దేరిన ఆమె ఆ తర్వాత తిరిగి ఇంటికి చేరుకోలేదు. గురువారం ఉదయం ఆఫీసుకు క్యాబ్ లో వెళ్తున్నట్లుగా భర్తకు భవ్యశ్రీ సెల్ ఫోన్ లో మెసేజ్ కూడా పెట్టింది. దాంతో తన భార్య కనిపించడంలేదంటూ భవ్యశ్రీ భర్త కార్తీక్ చైతన్య కూకట్ పల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
 
ఈ అదృశ్యం వివరాలను పరిశీలిస్తే.. విజయవాడకు చెందిన భవ్యశ్రీ చరిత, కార్తీక్ సుమారు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కేపీహెచ్ బీ కాలనీలోని ఏడో ఫేజ్ లో నివాసముంటున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు తాను క్యాబ్ లో ఆఫీసుకు బయల్దేరినట్లు ఆమె భర్తకు మెసేజ్ పెట్టింది. సుమారు గంట తర్వాత కార్తీక్ ఫోన్ చేయగా, ఆమె ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఆఫీసులో బిజీగా ఉందనుకుని ఊరుకుని మళ్లీ మధ్యాహ్నం, సాయంత్రం ట్రై చేసినా ఫలితం లేదు. దాంతో ఆఫీసుకు వెళ్లి అడిగితే.. అక్కడివాళ్లు ఆమె రాలేదని చెప్పారు. 
 
ఆ తర్వాత భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆఫీసుకు వెళ్లి విచారించగా, ఆమె గత కొన్ని రోజులుగా విధులకు హాజరుకావడం లేదని సమాధానమిచ్చారు. దాంతో ఆమె తనంతట తానే ఎక్కడికైనా వెళ్లిపోయిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అనే కోణంలో కూకట్ పల్లి పోలీసులు విచారణ సాగిస్తున్నారు. భవిశ్య అదృశ్యం కావడానికి కుటుంబ కలహాలు కూడా ఓ కారణంగా ఉండివుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

No comments:

Post a Comment