ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న బాహుబలి సినిమా షూటింగ్లో అపశృతి చోటుచేసుకుంది. దీంతో నలుగురు గాయపడ్డారు. వివరాల ప్రకారం హైదరాబాద్ హయత్నగర్ సమీపంలోని రామోజీ ఫిలింసిటీ పరిధిలో భారీ పోరాట సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ షూటింగ్లో పెద్ద ఎత్తున కుంకుమ వెదజల్లేందుకు కుంకుమ ఫ్యాకెట్లలో పేలేడు పదార్థాలను ఉంచారు. దీంతో అవి పేలి పక్కనే ఫైటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న నలుగురు ఫైటర్లపై ఎగిసి పడ్డాయి. దీంతో ఫైటర్లు సతీష్, పాండు, గణేష్, సంతోష్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో వారు హయత్నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.
No comments:
Post a Comment