ఖమ్మం జిల్లాకు చెందిన 12సంవత్సరాల శ్రీజ అనే బాలిక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ ను చూడాలని ఆరాటపడుతున్నది. తన కూతురి కోరికను తెలుసుకున్న తల్లిదండ్రులు బంధువుల సలహా మేరకు మేక్ ఎ విష్ ఫౌండేషన్ ప్రతినిధులను కలిశారు. మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ సాధిక్ అనే తీవ్ర వ్యాధిగ్రస్త బాలుడి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అవ్వాలన్న కోరికను బుధవారం నాడు తీర్చింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ని కలవాలని అనుకుంటున్న బాలిక గురించి మీడియా వద్ద ప్రస్తావించారు.ఆ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ శ్రీజని కలవటానికి అంగీకరించారట. ఈ రోజు లేదా రేపు ఖమ్మంలో పవన్ ఆమెను కలుస్తారట.
No comments:
Post a Comment