Friday 10 October 2014

భవ్యశ్రీ మిస్సింగ్ కేసు: భార్యాభర్తల మధ్య విభేదాల్లేవు

హైదరాబాద్‌కి చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగి భవ్యశ్రీ అదృశ్యం కేసులో దర్యాప్తు జరుగుతోందని మాదాపూర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. భవ్యశ్రీ ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. భవ్యశ్రీ, ఆమె భర్త కార్తీక్ చైతన్య మధ్య ఎలాంటి విభేదాలు లేవని డీసీపీ తెలిపారు. కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ గురువారం ఉదయం ఆఫీస్ కు క్యాబ్ లో వెళ్తున్నట్లు భర్త సెల్ ఫోన్ లో మెసేజ్ పెట్టింది. అనంతరం ఆమె ఆచూకీ తెలియకపోవటంతో కార్తీక్ చైతన్య కూకట్ పల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్యాబ్ డ్రైవర్లను విచారిస్తున్నారు

No comments:

Post a Comment