Saturday 4 October 2014

దేవరగట్టులో కర్రల సమరం బాలుడి మృతి

కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి దసరా రోజున ‘బన్నీ ఉత్సవం’ పేరిట జరిగే కర్రల సమరం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 సంవత్సరాల బాలుడు మరణించాడు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ ఏడాది కూడా దేవరగట్టులో కర్రల సమరం సమయానికి గ్రామస్థులు కర్రలు పట్టుకుని సమరానికి సిద్ధమయ్యారు. కర్రలతో, కాగడాలతో పరుగులు పెట్టారు. సంప్రదాయం పేరిట జరిగే ఈ పోరాటంలో ఎంతోమంది తలలు పగిలాయి. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. ఇదిలావుంటే చనిపోయిన బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తామని స్థానిక పోలీసులు అంటున్నారు

No comments:

Post a Comment