Wednesday 8 October 2014

చీపురు పట్టనున్న సానియా

స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా రిలయన్స్ గ్రూపు అధినేత అనీల్ అంబానీ బుధవారం నాడు మోడీ పిలుపు మేరకు అనిల్ బుధవారం తన స్నేహితులతో కలిసి ముంబయి చర్చి గేట్ ముందు పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా మరో తొమ్మిదిమంది ప్రముఖులకు సవాల్ విసిరారు. వాళ్ళలో సానియా మీర్జా కూడా వున్నారు. అనీల్ అంబానీ సవాల్ స్వీకరించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వరలో చీపురు పట్టనున్నారు. ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ అనీల్ అంబానీ చాలెంజ్ ను స్వీకరిస్తున్నానని, త్వరలో వీలు చూసుకుని డబ్ల్యూటీఏ చాంపియన్ షిప్ కు వెళ్లేలోపు స్వచ్ఛ భారత్ లో పాల్గొంటానని తెలిపారు

No comments:

Post a Comment