హైదరాబాద్, అక్టోబర్ 10 : ఆర్టీసీ పాలకమండలి సమావేశాన్ని అర్ధాంతరంగా రద్దు చేశారు. ఆర్టీసీ విభజనపై జవహర్ కమిటీ ఇచ్చిన నివేదికపై టీఎంయూ నేతలు అభ్యంతరం తెలిపారు. నివేదిక తప్పుల తడకగా ఉందని, హైదరాబాద్ ఆస్తులు ఏపీకి కేటాయించవద్దని నేతలు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొనడంతో అధికారులు సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు. మరోవైపు చట్టప్రకారం పంపకాలు జరగాలని ఏపీ కార్మిక సంఘాలు సూచించాయి
No comments:
Post a Comment