మహారాష్ట్ర నుంచి ముంబైను వేరే చేసే కుట్ర తనకు తెలియదని, అది ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తెలుసని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. అదేసమయంలో తాను ఢిల్లీ కుర్చీలో ఉన్నంత వరకు మహారాష్ట్రను ఏ శక్తీ కూడా ముక్కలు చేయలేరన్నారు.
అయితే, మహారాష్ట్రను విభజించనున్నారంటూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేయడాన్ని ఆయన తిప్పికొట్టారు. విభజన కుట్రలు ఒక్క కాంగ్రెస్ పార్టీకే తెలుసన్నారు. అధికారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి భూస్థాపితమై పోయిందని గుర్తు చేశారు.
ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్ర మోడీ.. సింధ్ఖేడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు గత పదేళ్ల నుంచి ఉల్లిపాయలు, పత్తి పంటల ఉత్పత్తులపై ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారని, వారు ఇపుడు మహారాష్ట్ర నుంచి ముంబైని వేరు చేస్తారంటూ దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ఆయన విమర్శించారు. తాను ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేస్తానని కాంగ్రెస్ చేస్తున్నది దుష్ప్రచారం మాత్రమేనని మోడీ అన్నారు. భారత్లోని ఏ ఒక్కరూ కూడా ఇలాంటి పని చేయలేరన్నారు.
No comments:
Post a Comment