కర్నాటక హైకోర్టు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. జయలలిత తరపున ఆమె లాయర్లు బుధవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటీషన్ను దాఖలు చేయనున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడిన జయకు కర్ణాటక హైకోర్టులో మంగళవారం నాడు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ జయ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో జయకు ఇప్పుడు సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోకతప్పలేదు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడిన జయకు కర్ణాటక హైకోర్టులో మంగళవారం నాడు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ జయ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో జయకు ఇప్పుడు సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోకతప్పలేదు.
No comments:
Post a Comment